Wednesday 4th June 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఘన విజయం.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

కాంగ్రెస్ ఘన విజయం.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

revanth reddy

Revanth Reddy Pressmeet | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అఖండ విజయం సాధించింది. దాదాపు 65 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వద్ద  మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని ప్రకటించారు.

ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్ అని తెలిపారు. సామాన్యులకు అందులో ప్రవేశం ఉంటుందని చెప్పారు.

పరిపాలన ఇక గతంలోలా ఉండబోదనీ, సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.

ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
‘అమెరికా మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ జరిగిందా?’
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions