- ‘రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు..
- రాజ్యసభలో ఆప్ ఖాళీ!
7 AAP MPs merge with BJP | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
ఆయనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఆప్ను వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాఘవ్ చద్దాతో పాటు సంధీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, విక్రమ్ సాహ్నీ, రాజేందర్ గుప్తా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది సభ్యులలో 7 మంది (రెండు మూడవ వంతు) తప్పుకోవడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. వీరంతా నేరుగా బీజేపీలో విలీనం అవుతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్కు లేఖ సమర్పించారు.
రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు…
“నేను తప్పు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అనిపించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పిన ఆప్, ఇప్పుడు తన సిద్ధాంతాల నుండి దారి తప్పి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది” అని ఆయన ఆరోపించారు.
ఆపరేషన్ లోటస్…
ఈ పరిణామంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితమే రాఘవ్ చద్దాను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పంజాబ్ రాజకీయాల్లో మరియు రాజ్యసభలో బీజేపీ బలాన్ని పెంచే దిశగా ఈ పరిణామం ఉండబోతోంది.






