Sunday 1st June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు.. మందకృష్ణ మాదిగ హర్షం |

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు.. మందకృష్ణ మాదిగ హర్షం |

Mandakrishna Madiga News | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ( Reservations ) ఉప వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ ( MRPS ) వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.

30 ఏళ్ల తమ పోరాటం ఫలించిందని చెప్పారు. తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు MRPS సుదీర్ఘ పోరాటం చేసిందని, ఈ క్రమంలో ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఉపవర్గీకరణ ( Sub-Classification ) అధికారం ఉందని సుప్రీం తీర్పును ఆయన స్వాగతించారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్గీకరణ విజయాన్ని ప్రాణాలర్పించిన MRPS నేతలకు అంకితం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొదట వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబే ( Cm Chandrababu )నని మందకృష్ణ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అలాగే వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని మందకృష్ణ కోరారు.

You may also like
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున-అమల.. కారణమేంటంటే!
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions