Sunday 3rd May 2026
12:07:03 PM
Home > తాజా > కేంద్రమంత్రిపై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్

కేంద్రమంత్రిపై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్

KTR files Rs. 10 cr defamation suit against Bandi Sanjay | భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరియు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఈ దావాలో, పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, మరియు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన న్యాయవాది ద్వారా ఈ కేసు నమోదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆగస్ట్ 8న బండి సంజయ్ సిట్ విచారణకు హాజరైన విషయం తెల్సిందే. అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. అయితే బండి స్పందించకపోవడంతో తాజగా రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions