Monday 2nd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్నూలు విషాదం..మాంసపు ముద్దలు కాదు అస్థిపంజరాలే

కర్నూలు విషాదం..మాంసపు ముద్దలు కాదు అస్థిపంజరాలే

Eye witness recounts Kurnool bus accident | కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైన ఘటన ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవదహనం అయ్యారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు ప్రత్యక్ష సాక్షి హేమా రెడ్డి. ప్రమాదం జరిగిన తర్వాత ఈమనే తొలుత పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఒక వీడియో ద్వారా ఆ భయంకర క్షణాలను గుర్తుచేసుకున్నారు.

‘నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తన్న సమయంలో చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏమైందా అని కారు దిగి చూస్తే ఓ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన కొందరు క్షతగాత్రులు రోడ్డుపై కూర్చొని తమవారు బస్సులోనే ఉన్నారు అంటూ రోధిస్తున్నారు. అక్కడే ఉన్న ఇతర వాహనదారులు మాత్రం తమ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. వెంటనే నేను కర్నూలు ఎస్పీ ఇతర అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. కర్నూలు రూరల్ ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ ఆరుగురిని మరో వ్యక్తి ప్రైవేట్ కారులో ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం తర్వాత బస్సులో మాంసపు ముద్దలు కాదు అస్థిపంజరాలే మిగిలాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి’ అని హేమా రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions