Saturday 7th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రవచన కర్త చాగంటికి కూటమి ప్రభుత్వం కీలక పదవి

ప్రవచన కర్త చాగంటికి కూటమి ప్రభుత్వం కీలక పదవి

Chaganti Koteshwara Rao Gets Key Post In Ap Govt. | ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ ( Nominated ) పదవుల రెండవ జాబితాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటికి కీలక పదవిని ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావు ( Chaganti Koteshwara Rao ) ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవికి క్యాబినెట్ హోదా ( Cabinet Rank ) కూడా కల్పించారు. అలాగే రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారునిగా మహమ్మద్‌ షరీఫ్‌, గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా మాల సురేంద్ర, శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా కుడిపూడి సత్తిబాబు తదితరులను ప్రభుత్వం నియమించింది.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions