Friday 3rd July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నిన్న మావిగన్, నేడు విజయవాడ.. జగన్ పై చంద్రబాబు విమర్శలు!  

నిన్న మావిగన్, నేడు విజయవాడ.. జగన్ పై చంద్రబాబు విమర్శలు!  

CM Chandrababu Slams YS Jagan | ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల అయిన ఉక్కు కర్మాగార నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న రాజధాని రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్‌ది మతిస్థిమితం లేని రాజకీయం..

రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని అంశంపై ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. “గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నాటకమాడారు.

అధికారం పోయాక నిన్న మావిగన్, నేడు విజయవాడ (Mavigan) అంటూ మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ మతిస్థిమితం లేని రాజకీయానికి నిదర్శనం” అని చంద్రబాబు దుయ్యబట్టారు.

Read Also: పాఠశాల సమీపంలో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం!

విశ్వసనీయత లేని వైఖరి..

మొన్న మావిగన్, నిన్న విజయవాడ అన్నోళ్లు.. రేపు ఏమంటారో వారికే తెలియదని, ఇలాంటి గందరగోళ రాజకీయాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తాము మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వసనీయతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

డేట్ రాసి పెట్టుకోండి.. 24 నెలల్లో ప్రాజెక్టు పూర్తి..

గత ప్రభుత్వ హయాంలో ఈ స్టీల్ ప్లాంట్‌కు జరిగిన మోసపూరిత శంకుస్థాపనలను చంద్రబాబు ఎండగట్టారు. 2019, 2023లలో కేవలం ప్రచార ఆర్భాటం కోసమే శంకుస్థాపనలు చేశారని, కనీసం తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు.

“ఈరోజు జూలై 3వ తేదీ. ఈ డేట్ డైరీలో రాసి పెట్టుకోండి. సరిగ్గా 24 నెలల్లో, అంటే 2028 జూలై 3వ తేదీ నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత.”అని చంద్రబాబు ప్రకటించారు.  

రూ.36,700 కోట్ల పెట్టుబడి..

దేశంలోనే తొలి ‘గ్రీన్ స్టీల్’ ప్లాంట్ గా నిలవనున్న ఈ భారీ ఉక్కు కర్మాగారం యొక్క ప్రత్యేకతలు మరియు మౌలిక వసతుల వివరాలను సీఎం సభకు వివరించారు.

దేశంలోనే మొదటిసారిగా పూర్తిగా పునరుత్పాదక ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) సహాయంతో ‘గ్రీన్ స్టీల్’ ఉత్పత్తి చేసే కర్మాగారం మన రాయలసీమలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. బళ్లారిలోని ప్లాంట్ కంటే పెద్ద యూనిట్‌గా దీనిని తీర్చిదిద్దాలని సజ్జన్ జిందాల్‌ను కోరినట్లు తెలిపారు.

 రత్నాల సీమగా మారుస్తా

రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌తో పాటు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, గోల్డ్ మైనింగ్ వంటి పరిశ్రమలను ఇక్కడికి రప్పిస్తామన్నారు.

Read Also:  రామమందిరం విరాళాల చోరీపై ఆర్‌ఎస్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

గ్లోబల్ హార్టికల్చర్ హబ్..

రాయలసీమ రైతుల కోసం రూ.1 లక్ష కోట్లతో ప్రపంచస్థాయి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను వచ్చే ఆగస్టు 15లోగా మదనపల్లిలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ‘వన్ ఫ్యామిలీ, వన్ ఆంత్రప్రెన్యూర్’ విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.

!రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రావాలన్నా, ప్రశాంతత ఉండాలన్నా శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

 గత ఐదేళ్లలో పెరిగిన గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, ఆడవాళ్ల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వివేకా హత్య కేసు వంటి హింసాత్మక రాజకీయాలకు చరమగీతం పాడుతూ, సీమను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

You may also like
vijay Sai Reddy
అమరావతి పేరిట అవినీతి యజ్ఞం: విజయసాయిరెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions