Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > దావోస్ లో సమ్మిట్..స్పెషల్ అట్రాక్షన్ గా మెగాస్టార్

దావోస్ లో సమ్మిట్..స్పెషల్ అట్రాక్షన్ గా మెగాస్టార్

Chiranjeevi joins CM Revanth Reddy at WEF 2026 | స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిరంజీవి కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారాలు వెళ్లారు. అయితే చిరంజీవి స్విట్జర్లాండ్ లోనే ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయన్ను సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం ‘జాయిన్ ది రైస్’ అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పాల్గొన్నారు చిరంజీవి. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను వీక్షించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను చూసినట్లు చిరుతో చెప్పారు సీఎం. సినిమా అద్భుతంగా ఉందన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions