Friday 20th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > “Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన

“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన

Operation Keller News | జమ్మూకశ్మీర్ లో కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మంగళవారం ఉదయం జమ్మూ షోపియన్ లోని కెల్లర్ ప్రాంతంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి సమాచారం వచ్చింది.

వెంటనే సైన్యం సెర్చ్ ఆండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన చేసింది. ఆపరేషన్ కెల్లర్ లో భాగంగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించినట్లు సైన్యం స్పష్టం చేసింది.

ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు, సైనికులపైకి కాల్పులు జరిపారని పేర్కొంది. సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు. అయితే ఆపరేషన్ కెల్లర్ ఇంకా కొనసాగుతుందని సైన్యం స్పష్టం చేసింది.

You may also like
తొలి మహిళా కండక్టర్లకు ఆర్టీసీ సన్మానం
ఫోన్ ట్యాపింగ్..షర్మిల వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి రియాక్షన్
బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేశ్ భేటీ
‘బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions