Thursday 26th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > క్రైస్తవురాలిగా ఆ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నా: షర్మిల

క్రైస్తవురాలిగా ఆ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నా: షర్మిల

ys sharmila

‌- కాంగ్రెస్ లో చేరిక అనంతరం కీలక వ్యాఖ్యలు

YS Sharmila | వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikharjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) కాంగ్రెస్ (Congress)లో విలీనం పూర్తయ్యింది. కాంగ్రెస్ లో చేరిన అనంతరం షర్మిల మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో మణిపూర్ (Manipur)లో జరిగిన ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మణిపూర్‌లో క్రూర ఘటనలను ఓ క్రైస్తవురాలిగా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. అక్కడ 2 వేల చర్చిలను ధ్వంసం చేశారనీ, 60 వేల మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందో నాకు అప్పుడే తెలిసిందన్నారు. ఆ రోజే కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

You may also like
sharmila
ఈసారైనా కట్టేనా.. లేక మళ్లీ మట్టేనా: ప్రధాని పర్యటనపై షర్మిల కామెంట్స్!
BJP Kishan REddy
ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!
mahesh goud
‘ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదు..’
telagnana budget
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions