Vijayasai Reddy On Sharmila | వైఎస్ కుటుంబ ( Ys Family ) ఆస్తుల పంపకంలో మాజీ సీఎం జగన్ ( Jagan ), ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Sharmila ) మధ్య తలెత్తిన విభేదాలు బహిరంగం అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే షర్మిల ను విమర్శిస్తూ వైసీపీ నాయకులు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం వైసీపీ నేత విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లిందని సెన్సేషనల్ ( Sensational ) వ్యాఖ్యలు చేశారు. కాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది.
‘ఆయన్ని ఇంప్రెస్ ( Impress ) చేయటానికి, పసుపు చీర కట్టుకుని వెళ్ళింది..సొంత చెల్లి గురించి, తన శాడిస్టు ముఠాతో, ఈ సైకో జగన్ ఎలా జుగుప్సాకరంగా తిట్టిస్తున్నాడో చూడండి.. ఇంప్రెస్ చేయటానికి, పసుపు చీరలు కట్టుకుని వెళ్లిందనే నీచ స్థాయికి రాజకీయాలని దింపేసాడు, ఈ జగన్ ‘ అంటూ టీడీపీ ( TDP ) ఫైర్ అయ్యింది.