Sunday 11th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ ని అది అడిగితే పతనం ఖాయం: భూమన హెచ్చరిక!

జగన్ ని అది అడిగితే పతనం ఖాయం: భూమన హెచ్చరిక!

Bhumana karunakar reddy

Jagan To visit Tirumala | ఏపీలో తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదం మరింత ముదురుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం తిరుమల వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) హాట్ కామెంట్స్ చేశారు.

తిరుమలలో జగన్ ను డిక్లరేషన్ (Tirumala Declaration) అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వ కపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదన్నారు.

గత ఐదేళ్లు సీఎం గా స్వామివారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించినప్ప టికీ డిక్లరేషన్ అడగటం దారుణమని అభిప్రాయపడ్డారు. డిక్లరేషన్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని, తమను ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామన్నారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions