Sunday 6th April 2025
12:07:03 PM
Home > తాజా > రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ సరికొత్త రికార్డ్!

రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ సరికొత్త రికార్డ్!

tsrtc

TGSRTC Record On Rakhi Pournami | రాఖీ పౌర్ణమి (Rakhi Pournami) పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) సరికొత్త రికార్డులు నమోదు చేసింది. రక్షాబంధన్ రోజు రికార్డు స్థాయిలో ప్రయాణికులను ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేరవేసింది. సోమవారం ఒక్కరోజే  రికార్డు స్థాయిలో 63.86 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు.

ఒక్కరోజులోనే 41.74 లక్షల మంది మ‌హిళ‌లు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కాన్ని వినియోగించుకున్నారు. 21.12 లక్షల మంది న‌గ‌దు చెల్లించి బ‌స్సుల్లో ప్రయాణం చేశారు. రాఖీ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల రాబ‌డి ఆర్టీసీకి వ‌చ్చింద‌ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు రాబడి రాగా.. న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా మరో రూ.15 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చింద‌ని తెలిపారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సుర‌క్షితంగా గమ్యస్థానాలకు చేర‌వేసిన ఆర్టీసీ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.  

You may also like
‘అయోధ్యలో అద్భుతం..బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం’
‘శ్రీరామనవమి..పంబన్ బ్రిడ్జి జాతికి అంకితం చేసిన ప్రధాని’
‘వృద్ధి రేటులో రెండవ స్థానం..ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’
‘సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions