Wednesday 19th February 2025
12:07:03 PM
Home > తాజా > త్రివేణి సంగమంలో ప్రకాశ్ రాజ్ స్నానం..వైరల్ ఫోటోపై నటుడు ఏమన్నారంటే!

త్రివేణి సంగమంలో ప్రకాశ్ రాజ్ స్నానం..వైరల్ ఫోటోపై నటుడు ఏమన్నారంటే!

Prakash Raj In Maha KumbhMela | నటుడు ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన ఒక ఫోటో తాజగా వైరల్ గా మారింది. ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా ప్రకాశ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరిస్తున్నట్లు ఆ ఫోటో ఉంది.

అది నకిలీదా లేక ఒరిజినలా ( Original ) అనేది తెలియకుండా కొందరు నెటిజన్లు ప్రకాశ్ రాజ్ పై విమర్శలు గుప్పించారు. తనకు తాను నాస్తికుడని చెప్పుకునే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కుంభమేళాలో పవిత్ర స్నానం ఎలా చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించారు.

కాగా వైరల్ గా మారిన ఫోటోపై తాజగా ప్రకాశ్ రాజ్ ఎక్స్ ( X ) వేదికగా స్పందించారు. ఫేక్ న్యూస్ అలెర్ట్ ( Fake News Alert ) అంటూ ఫోటో నకిలీది అని స్పష్టం చేశారు. ఫేకు మహారాజ్ యొక్క మతోన్మాదులు మరియు వారి పిరికి దళం యొక్క చివరి ప్రయత్నం ఇది అంటూ ఫైర్ అయ్యారు.

వారి పవిత్ర కార్యక్రమంలో కూడా ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు ఫిర్యాదు చేసినట్లు, సంబంధిత వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

You may also like
భారత్ కు డబ్బులెందుకివ్వాలి..ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఛత్రపతి శివాజీ జయంతి..మహారాజ్ ను స్మరించుకున్న ప్రధాని
దిగొచ్చిన పాకిస్తాన్..స్టేడియంలో భారత జాతీయ జెండా
చంద్రబాబు మార్కెట్ యార్డుకు రావాలి..జగన్ డిమాండ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions