Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది..ఎస్పీకి దండం పెట్టిన జీవన్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది..ఎస్పీకి దండం పెట్టిన జీవన్ రెడ్డి

Murder Of Congress Leader In Jagityal | జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy ) అనుచరుడి హత్య జరగడం సంచలనంగా మారింది. జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి ( Gangireddy )హత్య జరిగింది.

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంతోష్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో మృతికి నిరసనగా జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి జీవన్ రెడ్డి నిరసన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ( Demand ) చేశారు. తన తమ్ముడి లాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. జగిత్యాలలో బీఆరెస్ ( BRS ) రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. నిరసనని విరమించాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.

జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఎస్పీ ( SP )కి దండం పెట్టారు. కాంగ్రెస్ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions