Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

Minister Jaishankar In Pakistan | పాకిస్తాన్ దేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మార్నింగ్ వాక్ ( Morning Walk ) చేశారు.

షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జై శంకర్ మంగళవారం పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పాక్ లోని భారత హైకమీషన్ లో ఉన్న సిబ్బందితో కేంద్రమంత్రి మార్నింగ్ వాక్ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేసి, పాక్ లో టీం ఇండియా ( Team India )తో మార్నింగ్ వాక్ అని కాప్షన్ ( Caption ) ఇచ్చారు. అలాగే అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటండి అని ప్రధాని మోదీ ( Pm Modi )పిలుపు మేరకు కేంద్రమంత్రి జై శంకర్ పాక్ లో అర్జున మొక్కను నాటారు.

ఇదిలా ఉండగా మంగళవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్ ( Islamabad ) చేరుకున్న కేంద్రమంత్రికి ఆ దేశ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎస్ఓసి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్యదేశాలు ప్రతినిధులకు ఆ దేశ ప్రధాని షేహ్ బాజ్ షరీఫ్ మంగళవారం రాత్రి విందు ఇచ్చారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? : కేటీఆర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions