Monday 16th June 2025
12:07:03 PM
Home > తాజా > విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

Janwada Farmhouse Party News | జన్వాడ లోని రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ( Raj Pakala )ఫార్మ్ హౌస్ లో శనివారం రాత్రి భారీ శబ్దాలతో పార్టీని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటి ( Cyberabad SOT )పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పాల్గొన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కోకైన్ తీసుకున్నట్లు నిర్దారించారు. ఈ క్రమంలో NDPS చట్టం కింద కేసును నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగానే రాజ్ పాకాలకు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫార్మ్ హౌస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ( KTR ) బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీసుల ఎదుట హాజరయ్యారు. న్యాయవాదితో పాటు రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో జన్వాడ ఫార్మ్ హౌస్ పార్టీకి సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions