KTR | బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. నగరంలోని పారిశుద్ధ్య కార్మికులతో ఆయన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
సోమవారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం పారిశుద్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
కార్మికులతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ లోనే పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.










