Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్

ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్

Abhaya Anjaneya Swamy Temple Vandalised In Ap | అన్నమయ్య ( Annamayya ) జిల్లా కదిరినాధుని కోట పంచాయతీ లోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించే ప్రయత్నం చేశారు. నిత్యం పూజలు జరిగే ఆలయాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో స్థానిక ఆరెస్సెస్ ( RSS ), బీజేపీ ( BJP ) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై మొలకలుచెరువు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ ( Serious )గా తీసుకుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu )ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ ధ్వంస సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నేరం చేసిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions