Friday 13th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అన్నాడు

సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అన్నాడు

Ys Sharmila Open Letter To YSR Fans | మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ( Ys Rajashekar Reddy ) అభిమానులకు ఏపీ కాంగ్రెస్ ( AP Congress ) చీఫ్ షర్మిల బహిరంగ లేఖను రాశారు.

రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత కాలం నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ ( Grand Children ) తనకు సమానం అని, అన్ని కుటుంబ వ్యాపారాల్లో ఆ నలుగురికి సమాన వాటా ఉండాలని చెప్పినట్లు లేఖలో షర్మిల ప్రస్తావించారు.

వైఎస్సార్ ( YSR ) బ్రతికి ఉన్నప్పుడు స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ ( Gaurdian ) మాత్రమే నని పేర్కొన్నారు. ఆస్తులను సమానంగా పంచిపెట్టడమే జగన్ బాధ్యత అని అన్నారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్థులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు.

2019లో అన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా గుర్తుపట్టలేనంతగా మారిపోయారని షర్మిల ఆరోపించారు. చిన్నచూపు చూడడమే కాకుండా సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ ( Israel ) పర్యటనలో భాగంగా ప్రతిపాదన పెట్టినట్లు చెప్పారు. తాను 60 శాతం తీసుకుంటా నీకు 40 శాతం ఇస్తా అని జగన్ చెప్పినట్లు షర్మిల వెల్లడించారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions