Sunday 1st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

Ys Sharmila News | పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి మూలంగ జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

మోదీ సర్కార్ వైఫల్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ చేశారు. ఈ చౌకిదార్ ప్రభుత్వం అంటే మోదీ యొక్క కాపాలదారుడి ప్రభుత్వం సరిహద్దుల్ని రక్షించడంలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు.

దేశ ప్రజలపై, అసమ్మతిని అణిచివేయడంలో, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. ‘ ప్రధాని గారు, ఇదిగొండి లాఠీ. శత్రువులపైన దీన్ని వినియోగించండి, అంతేకాని భారత్ లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించేవారిపై మాత్రం కాదు’ అని షర్మిల పేర్కొన్నారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions