Ys Sharmila News | పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి మూలంగ జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
మోదీ సర్కార్ వైఫల్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ చేశారు. ఈ చౌకిదార్ ప్రభుత్వం అంటే మోదీ యొక్క కాపాలదారుడి ప్రభుత్వం సరిహద్దుల్ని రక్షించడంలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు.
దేశ ప్రజలపై, అసమ్మతిని అణిచివేయడంలో, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. ‘ ప్రధాని గారు, ఇదిగొండి లాఠీ. శత్రువులపైన దీన్ని వినియోగించండి, అంతేకాని భారత్ లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించేవారిపై మాత్రం కాదు’ అని షర్మిల పేర్కొన్నారు.










