Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బాబు గారు..అక్కచెల్లమ్మల ఉసురు పోసుకుంటారా?’

‘బాబు గారు..అక్కచెల్లమ్మల ఉసురు పోసుకుంటారా?’

YS Jagan News Latest | ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని విమర్శించారు.

అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.

కూటమి సర్కారు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యిందన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారని జగన్ అడిగారు. వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, వైసీపీ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? అని జగన్ కన్నెర్ర చేశారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions