Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి!

ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి!

cm revanth reddy speech

CM Revanth Independence Day Speech | భారత దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అహింసా పద్దతిలో స్వాతంత్య్ర సాధించి, పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు.

దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందంటూ నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయమనీ, ఆయన స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.

ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతోందనీ, ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నామని వివరించారు.

సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన అన్నారు. రేషన్ షాపులతో సన్నబియ్యం, రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదనీ, మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

You may also like
Pm modi warns pak
ఆ బెదిరింపులకు భారత్ భయపడదు.. పాక్ కు మోదీ వార్నింగ్!
modi hoists national flag
79వ స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని మోదీ మరో ఘనత!
Aadya with her father pk
‘తండ్రి సేవలను అర్థం చేసుకుంది..’ ఆద్యపై రేణు దేశాయ్ పోస్ట్!
14వేల మంది ఆదివాసీ చిన్నారులు.. గిన్నీసుకెక్కిన జాతీయ గీతం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions