Friday 20th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

Police Adopts New Borngirl Found In Bushes | ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మే ఇంటికి వచ్చిందని అనుకుంటారు. కానీ అప్పుడేపుట్టిన ఓ చిన్నారిని తల్లి చెత్తకుప్పలో వదిలేసి వెళ్ళింది. ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లోని ఘజియాబాద్ ( Gaziabad ) లో చోటుచేసుకుంది.

చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లికోసం పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

దింతో ఆడబిడ్డ పరిస్థితిని చూసిన ఓ పోలీస్ చలించిపోయారు. పసికందును దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. పుష్పేంద్ర సింగ్ ( Sub-Inspector Pushpendra Singh )దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే వారికి సంతానం కలగలేదు.

ఈ క్రమంలో చెత్తబుట్టలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకోవాలని వారు భావించారు. దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియను మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పుష్పేంద్ర సింగ్ విజయదశమి నాడు స్వయంగా దుర్గమ్మే చిన్నారి రూపంలో తమ వద్దకు వచ్చిందన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ మానవత్వానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions