Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

దసరా నాడు చెత్తకుండిలో దొరికిన బిడ్డను దత్తత తీసుకున్న పోలీస్

Police Adopts New Borngirl Found In Bushes | ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మే ఇంటికి వచ్చిందని అనుకుంటారు. కానీ అప్పుడేపుట్టిన ఓ చిన్నారిని తల్లి చెత్తకుప్పలో వదిలేసి వెళ్ళింది. ఈ అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లోని ఘజియాబాద్ ( Gaziabad ) లో చోటుచేసుకుంది.

చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లికోసం పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

దింతో ఆడబిడ్డ పరిస్థితిని చూసిన ఓ పోలీస్ చలించిపోయారు. పసికందును దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. పుష్పేంద్ర సింగ్ ( Sub-Inspector Pushpendra Singh )దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే వారికి సంతానం కలగలేదు.

ఈ క్రమంలో చెత్తబుట్టలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకోవాలని వారు భావించారు. దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియను మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పుష్పేంద్ర సింగ్ విజయదశమి నాడు స్వయంగా దుర్గమ్మే చిన్నారి రూపంలో తమ వద్దకు వచ్చిందన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్ మానవత్వానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions