Monday 5th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎన్నికలు మహారాష్ట్రలో..వసూళ్లు తెలంగాణలో

ఎన్నికలు మహారాష్ట్రలో..వసూళ్లు తెలంగాణలో

Pm Modi Fires On Congress Party | కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాని మోదీ ( Pm Modi ). మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అకోలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎం ( ATM ) లాగా మారాయని విమర్శించారు. ఏటీఎం నుండి డబ్బులు తీసుకున్న విధంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు.

మహారాష్ట్రలో ఎన్నికలు అయితే కర్ణాటక ( Karnataka ), తెలంగాణ ( Telangana ) వంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీ వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ), తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చేసిందని దుయ్యబట్టారు.

మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇప్పటికే కర్ణాటక మద్యం విక్రయదారుల నుండి రూ.700 కోట్లు కొల్లగొట్టారని ప్రధాని ఫైర్ అయ్యారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విడగొట్టాలని హస్తం పార్టీ భావిస్తుందన్నారు.

You may also like
‘ఆర్టీసీ సమస్యలు తొలుగుతున్నాయ్..సమ్మె చేయొద్దు’
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
మాక్ డ్రిల్స్ నిర్వహించండి..రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!
‘భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్న భర్త’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions