PM Modi After India Beat Pak In Asia Cup Final | ఆసియా కప్ లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో దాయాధి పాకిస్థాన్ ను చిత్తు చేసింది భారత్. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ జరిగిందని ఎప్పటిలాగే భారత్ ఘన విజయాన్ని నమోదు చేసిందని ప్రధాని చేసిన పోస్టును నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ‘మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్. ఎప్పటిలాగే ఫలితం ఒక్కటే. భారత్ ఘన విజయం. క్రికెటర్లకు అభినందనలు’ అని ప్రధాని పోస్ట్ చేశారు.










