Pawan Kalyan On Botsa health | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. గురువారం రాత్రి బొత్స బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినట్లు, దింతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని కథనాలు వస్తున్నాయి.
ఈ తరుణంలో పవన్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడినట్లు చెప్పారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.










