Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

Manchu Lakshmi Adopts Schools In Telangana | ప్రముఖ నటి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు మంచు లక్ష్మి వచ్చారు.

టీచ్ ఫర్ చేంజ్ ( Teach For Change ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ( Digital )తరగతులు, మౌలిక సదుపాయాలకు ఆమె కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు సోమవారం మంచు లక్ష్మి గద్వాల్ వెళ్లారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గట్టు మండలంలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్మాణం చేసినట్లు, అలాగే మరో 20 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.

అక్షరాస్యతలో వెనుకబడిన గట్టు ప్రాంతాన్ని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తామని లక్ష్మీ హామీ ఇచ్చారు. ఆమె చర్యలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions