Wednesday 4th June 2025
12:07:03 PM
Home > తాజా > మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా

Manchu Lakshmi Adopts Schools In Telangana | ప్రముఖ నటి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు మంచు లక్ష్మి వచ్చారు.

టీచ్ ఫర్ చేంజ్ ( Teach For Change ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ( Digital )తరగతులు, మౌలిక సదుపాయాలకు ఆమె కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు సోమవారం మంచు లక్ష్మి గద్వాల్ వెళ్లారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గట్టు మండలంలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్మాణం చేసినట్లు, అలాగే మరో 20 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.

అక్షరాస్యతలో వెనుకబడిన గట్టు ప్రాంతాన్ని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తామని లక్ష్మీ హామీ ఇచ్చారు. ఆమె చర్యలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions