KTR Criticises Cm Revanth For Rs. 80500 Cr Debt | రేవంత్ ( Revanth Reddy ) కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు అని తెలిపారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ). 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని కాంగ్రెస్ సర్కారు పై మండిపడ్డారు.
అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..! ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు అని నిలదీశారు.
మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ?? అని కేటీఆర్ అనుమానం వ్యక్తపరిచారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ?? అంటూ ప్రశ్నించారు.
అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అని విమర్శించారు. బీఆర్ఎస్ ( Brs ) హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం.. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం….తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం..కానీ ముఖ్యమంత్రి రేవంత్ తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ ? అని అడిగారు.
రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా..సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని కేటీఆర్ హెచ్చరించారు.