Tuesday 3rd March 2026
12:07:03 PM
Home > తాజా > ‘వెయిటింగ్ రూమే లైబ్రరీ..కరీంనగర్ కలెక్టర్ గొప్ప ఆలోచన’

‘వెయిటింగ్ రూమే లైబ్రరీ..కరీంనగర్ కలెక్టర్ గొప్ప ఆలోచన’

Karimnagar Collector Pamela Tatpathy News | కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏవైనా పనుల కోసం కలెక్టరేట్ కు వెళ్తే అధికారులు అందుబాటులో లేకపోతే వారికోసం గంటల కొద్దీ వేచి చూడాలి.

ఈ ఖాళీ సమయంలో ఏమి చేయాలో తోచదు. కొన్ని సందర్భాల్లో పనులు పూర్తి చేసుక్కవడానికి వచ్చిన సందర్శకులకు విసుగు కూడా కలుగుతుంది. అధికారులు సమావేశాల్లో ఉంటేనో లేదా అందుబాటులో లేకుంటే సందర్శకులు ఇబ్బంది పడకూడదని భావించారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.

ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లో గతంలో స్టోర్ రూమ్ గా ఉపయోగించిన గదిని ఇప్పుడు లైబ్రరీగా మార్చారు. ఎనమిది నెలల క్రితం వివిధ అంశాలకు చెందిన సుమారు 200 పుస్తకాలను గ్రంధాలయంలో ఏర్పాటు చేశారు.

దింతో అధికారుల కోసం నిరీక్షించే సందర్శకులు ఇప్పుడు ఎంచక్కా పుస్తకాలను చదువుకుంటున్నారు. కలెక్టర్ ఆలోచన పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా హర్షం వ్యక్తం చేశారు.

You may also like
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions