Kalvakuntla Kavitha News | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ లభించిన విషయం తెల్సిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులగా ఉన్నవారి పేర్లను రౌస్ ఎవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసిన విషయం తెల్సిందే. ఈ తరుణంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతున్నట్లు ఇప్పుడు అలానే వచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పినట్లు తెలిపారు. తాను, తన కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించిందని ఆమె ఆవేదన చెందారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను -వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు అనుచితంగా మాట్లాడారని ఈ సందర్భంగా కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.










