Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి..యోగి సంచలన నిర్ణయం

తోడేళ్ళు కనిపిస్తే కాల్చేయండి..యోగి సంచలన నిర్ణయం

Cm Yogi Orders ‘Shoot At Sight’ On Wolves | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాష్ట్రం బహరాయిచ్ ( Bahraich ) జిల్లాను తోడేళ్ళు వణికిస్తున్నాయి. జిల్లాలోని మహసి ప్రాంతంలో ఆరు తోడేళ్లు ( Wolves ) గల ఓ గుంపు సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నాయి.

ఈ దాడుల్లో ఇప్పటికే 10మంది మృతి చెందగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. మృతిచెందిన వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) కీలక నిర్ణయం తీసుకున్నారు. తోడేళ్ల పై ‘షూట్ ఎట్ సైట్’ ( Shoot At Sight ) ఆర్డర్ జారీ చేశారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.

తోడేళ్లను పట్టుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఖేడియా’ ( Operation Khedia )లో భాగంగా నాలుగు తోడేళ్లను పట్టుకున్నట్లు, మరో రెండు మాత్రం దొరకడం లేదని అధికారులు సీఎంకు వివరించారు.అవి నిత్యం స్థావరాలను మారుస్తున్నట్లు సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో అవి కనిపిస్తే కాల్చేయండి అని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ‘షూట్ ఎట్ సైట్’ ను చివరి అవకాశంగా మాత్రమే భావించాలని సీఎం పేర్కొన్నారు.

You may also like
‘ఫోన్ తో స్కాన్ చేశా..నువ్ బంగ్లాదేశీ’
దిశా పటానీ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన సీఎం యోగి
దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక అంతే !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions