CM Revanth Reddy About Bhu Bharati Portal | సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్సైట్ను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భద్రత కోసం ఫైర్వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
భూ భారతి వెబ్సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా దాన్ని రూపొందించాలని సూచించారు.
మరోవైపు ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద మూడు మండలాల్లో భూభారతిని అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా ఇది అమలు కానుందని వెల్లడించారు.