Bandi Sanjay Comments | ”అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలే… బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నాకొడుకుల అంతు చూస్తాం.
యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం’’అని బీజేపీ (BJP Telangana) రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) హెచ్చరించారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేయడంతోపాటు మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడిందంటూ మండిపడ్డారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా (Mahila Morcha) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
Bandi Sanjay Comments | “సీఎం కేసీఆర్ చేతగానితనం వల్ల ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము చూపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
సైఫ్ అనే సైకో చేసిన హత్య. సీఎంఓ నుండి వచ్చిన ఫోన్ తో ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేసి గౌరవిస్తే రాష్ట్రంలో ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడింది.
Read Also: గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర!
కేసీఆర్ (CM KCR) గతంలో ఎవరైనా తప్పు చేస్తే గుడ్లు, పీకేస్తా అని చేసిన హెచ్చరికలు ఉత్తమాటలే. యూపీలో బుల్ డోజర్లు పడుతున్నాయి.
బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నాకొడుకుల అంతు చూస్తాం. యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం.
మోదీ గారు దేశ రక్షణ మంత్రిగా సీతారామన్ (Nirmala Seetharaman) ను నియమించారు. ఇంటికి తాళం చెవి ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది.
అట్లాగే 40 లక్షల కోట్ల దేశ బడ్జెట్ ను సీతారామన్ చేతిలో పెట్టారు. 12 మంది మహిళా మంత్రులను, 8 మంది గవర్నర్లను, 4గురిని సీఎంలుగా చేసిన ఘనత నరేంద్రమోదీదే.
కేంద్రం పీఎంఏవై కింద ఇండ్లు, గ్యాస్ కనెక్షన్లు సహా అన్నీ మహిళల పేరిటే ఇస్తున్నారు. ఆనాడు మోదీ ఎర్రకోటపై టాయిలెట్ల గురించి మాట్లాడితే ఎద్దేవా చేశారు.
కానీ 30 కోట్ల టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత నరేంద్రమోదీదే.
Read Also: ఘోర రైలు ప్రమాదం.. 32 మంది సజీవ దహనం!
రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతోంది. మహిళలను పట్టించుకునే పాపాన పోలేదు. జూబ్లిహిల్స్ సంఘటన నుండి నిన్నటి ప్రీతి హత్య వరకు అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కేసీఆర్ స్పందించరు.
హోంమంత్రి ఉన్నరా? లేరా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో మహిళలంటే కవిత మాత్రమేనా? నిధులు, దందాలన్నీ ఆమెకేనా? మహిళల గురించి పోరాడేది మహిళా మోర్చా మాత్రమే.
రాష్ట్రంలో బీజేపీయే బీఆర్ఎస్ (BRS Party) కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. 1999లో చంద్రబాబు ప్రత్యామ్నాయం.. 2004లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కన్పించింది.
ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మార్పు కోరుకుంటున్నారు.
మహిళలు తలెత్తుకుని తిరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. అధికారంలోకి వస్తుంది.
పేదలంతా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కుటుంబ పాలనను అంతం కావాలని కోరుకుంటున్నరు.
షర్మిలను తిట్టడం దారుణం..
వైఎస్ షర్మిల (YS Sharmila) గారిని బూతులు తిట్టడం దారుణం. ఆమె ఏ పార్టీ అయినా కానీ మహిళలను దూషించడం దారుణం. సనాతన భారతీయ సంస్కృతి చెబుతోంది.
తోటి మహిళలను తల్లిగా, సోదరిగా గౌరవించాలి. నిజంగా భారతీయుడైతే, మనిషివైతే మహిళలను కించపర్చరు.
Also Read: భైంసా ఆర్ఎస్ఎస్ మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులివే!
కేసీఆర్ కొడుకుకు భయం పట్టుకుంది..
బండి సంజయ్ అంటే కేసీఆర్ కొడుకుకు భయం పట్టుకుంది. కేసీఆర్ కొడుకు పేరును ప్రస్తావించొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నడు.
ట్విట్టర్ టిల్లుకు సిగ్గు లేదు… కేంద్రం ఏమిచ్చిందంటూ ప్రతిసారి సోయి లేకుండా మాట్లాడుతున్నడు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు సిద్ధమని చెబితే పారిపోతున్నడు.
కార్పొరేటర్ నైన నన్ను అధ్యక్షుడిని చేస్తే తప్పేంది? ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే.
టీఆర్ఎస్ లో ఆ అవకాశం ఉంటుందా? మహిళ అంటే కేసీఆర్ బిడ్డే. లిక్కర్ దందాతో తెలంగాణ పరువు తీస్తోంది.
రాష్ట్రంలో ఈరోజు జరుగుతునన్న హత్యలు, అత్యాచారాలకు, దాడులకు ప్రధాన కారణం మద్యం అమ్మకాలే. తాగడానికి నీళ్లు లేవు కానీ మద్యానికి ఢోకా లేకుండా చేస్తున్నారు. బెల్టు షాపులను నిషేధించాల్సిన అవసరం ఉంది.
కవితను అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో మహిళలను ఏకం చేసి జిల్లా మహిళా మోర్చా నాయకులు పోరాడుతున్నరు.
మోదీ మాకు దేవుడే..
మోదీ హీరో.. మీ అయ్య రాక్షసుడిలెక్క కన్పిస్తున్నడు కాబట్టే మోదీగారు దేవుడి లెక్క కన్పిస్తున్నడు. తప్పేముంది?
రెండు సార్లు గెలిచి ప్రధాని అయ్యారు… మూడోసారి గెలిచి మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నరు. ప్రపంచమంతా మోదీగారిని బెస్ట్ పీఎంగా కొనియాడుతుంటే… వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియాగా కేసీఆర్ ను చీత్కరిస్తున్నరు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేసినా సాధించేదేమీలేదు. ఇచ్చిన హామీలే అమలు చేయలేనోడు. మహిళా వర్శిటీని ఏర్పాటు చేస్తామని ఇంతవరకు అమలు చేయని మూర్ఖుడు.
బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా సమావేశాలుసహా ఏ మీటింగ్ లు పార్టీ కార్యాలయంలో పెట్టినా పోలీసుల బందోబస్తు పెడుతున్నారు.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్..
మహిళలుసహా కార్యకర్తలంతా కష్టపడటంవల్లే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ అయ్యాయి. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరుస్తున్న బైరి నరేష్ లాంటి వాళ్లకు తగిన బుద్ది చెబుతున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్.
పార్టీ కోసం, దేశం, ధర్మం కోసం జైలుకు వెళ్లేందుకు వెనుకాడని వాళ్లకు నా అభినందనలు.. మహిళల పక్షాన పోరాడుతున్న మహిళా మోర్చా నేతలుండటం గ్రేట్.
కష్టపడి పనిచేస్తూ గెలిచే అవకాశమున్న మహిళా నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే బాధ్యత నాది. ఈసారి ఎక్కువ మంది మహిళా మోర్చా నాయకులు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నా.
డబ్బుల గురించి ఆలోచించొద్దు.. ప్రజల తరపున కొట్లాడండి.. నేను సామన్య కార్యకర్తను. కార్పొరేటర్ గా ఉన్న నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను.
9 ఏళ్లు పార్టీలో నాకు ఏ పదవి లేదు.. అయినా జనంలోనే ఉన్నా.. పార్టీ ఆఫీస్ లో కార్యకర్తగా ఉన్న కిషన్ రెడ్డి ఇయాళ కేంద్ర మంత్రి అయ్యారు. కష్టపడే వాళ్లకు బీజేపీలో తప్పకుండా గుర్తింపు వస్తుంది”