Balayya and Rajini To Get A Rare Honor Together | సూపర్ స్టార్ రజినీకాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఇద్దరు అగ్ర నటులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. గోవా వేదికగా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ కీలక ప్రకటన చేశారు. సినీ కెరీర్ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న రజినీకాంత్, బాలకృష్ణ ను ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలోనే ప్రకటించారు.
భారతీయ సంస్కృతిపై సినిమాల ద్వారా రజినీకాంత్, బాలకృష్ణ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నవంబర్ 28న గోవాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలో ఈ మేరకు రజినీకాంత్, బాలకృష్ణ లకు ప్రత్యేక సన్మానం జరగనుంది.










