Thursday 19th June 2025
12:07:03 PM
Home > తాజా > వికారాబాద్ కలెక్టర్ పై దాడి..వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

వికారాబాద్ కలెక్టర్ పై దాడి..వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

Attack On Vikarabad Collector | ఫార్మా కంపెనీ ( Pharma Company ) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ( Prateek Jain ), కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ( KADA ) చైర్మన్ వెంకట్ రెడ్డిలపై పలువురు లగచర్ల గ్రామస్థులు దాడి చేసిన విషయం తెల్సిందే.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

అలాగే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా సురేష్ అనే వ్యక్తి వ్యవహరించినట్లు తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి ( Patnam Narendar Reddy ) ప్రధాన అనుచరుడే సురేష్ అని కథనాలు వస్తున్నాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేష్ కాల్ డేటా ( Call Data )ను పోలీసులు పరిశీలించారు.

దాడి జరగడానికంటే గంటల ముందు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సురేష్ తో మాట్లాడుతున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డి ఆరు సార్లు కేటీఆర్ ( KTR ) తో సంభాషణ జరిపినట్లు తెలుస్తోంది. కాగా గతంలో పలుసార్లు సురేష్ పై పోలీసు కేసు నమోదయినట్లు సమాచారం.

You may also like
విమాన ప్రమాద స్థలంలో బంగారం సేకరించి..మానవత్వం చాటుకుని
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని
‘మీ ప్రమేయం లేదు’..డోనాల్డ్ ట్రంప్ కు తేల్చి చెప్పిన మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions