Woman Cuts Her Thumb | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల నేపథ్యంలో ఓ మహిళ దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బొటన వేలు నరుక్కుని సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం సంచలనంగా మారింది.
వైసీపీ నేతలు భూకబ్జాలకు, మత్తు పదార్ధాల విక్రయాలకు, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద తన బొటన వేలు నరుక్కున్నారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయని, ఈ అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రధాని మోదీ (Narendra Modi), సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (CJI Chandrachud) దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం లో భాగంగా ఆమె ఏకలవ్య నిరసనకు దిగారు.