All Services will be online | సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్టీజీఎస్ పై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగ వలసిన అవసరం లేకుండా మనమిత్ర (Mana Mithra) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.
విధ్వంసమైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు, నిర్వీర్యమైన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని ఆరోపించిన సీఎం ప్రస్తుతం వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.










