Saturday 13th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మెస్సితో ఫోటో..చాలా ఖరీదు గురు!

మెస్సితో ఫోటో..చాలా ఖరీదు గురు!

Rs.10 lakh for photograph with Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి మూడు రోజుల పర్యటన కోసం భారత్ కు రానున్నారు. డిసెంబర్ 13న ఆయన భారత్ కు వస్తారు. ‘ది గోట్ టూర్ ఆఫ్ ఇండియా-2025’ లో భాగంగా మెస్సి కోల్కత్త, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాల్లోని అభిమానులను కలుస్తారు. ఇకపోతే హైదరాబాద్ కు రానున్న మెస్సితో ఫోటో దిగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అనంతరం ఫలకనుమా ప్యాలెస్ లో మెస్సితో ‘మీట్ అండ్ గ్రీట్’ ఉండనుంది. ఈ సమయంలో మెస్సితో ఫోటో దిగాలి అంటే మాత్రం రూ.10 లక్షలు చెల్లించాల్సిందే. ఈ మేరకు మెస్సి హైదరాబాద్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నారు ది గోట్ ఇండియా టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి.

శనివారం సాయంత్రం మెస్సి హైదరాబాద్ లో అడుగుపెడుతారని ఆమె పేర్కొన్నారు. ఉప్పల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం ఫలకనుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ సమయంలో మెస్సితో ఫోటో దిగే అవకాశం ఉంటుందని, కానీ ఫోటో దిగాలి అని అనుకునే వారు రూ.9.95 లక్షలు జీఎస్టీ అదనంగా చెల్లించాలని తెలిపారు. అయినప్పటికీ కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పార్వతిరెడ్డి స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions