Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > చిరు-పవన్ కలిసి సినిమా చేస్తే..ఆర్జీవి పోస్ట్ వైరల్

చిరు-పవన్ కలిసి సినిమా చేస్తే..ఆర్జీవి పోస్ట్ వైరల్

MEGA POWER film of the CENTURY | మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో వివరించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ.

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. సెప్టెంబర్ 22 నాటికి అది విడుదలై 47 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై ఆర్జీవి స్పందించారు.

‘మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మీరు ఒక మెగా పవర్ సహాయం చేసినవారవుతారు. అది ఈ శతాబ్దంలోని మెగా పవర్ చిత్రం అవుతుంది’ అని ఆర్జీవి పేర్కొన్నారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions