Wednesday 15th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అనకాపల్లి ఘటన..హోంమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం’

‘అనకాపల్లి ఘటన..హోంమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం’

Explosion at fireworks manufacturing unit in Anakapalle | అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఎనమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కార్మికులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరోవైపు అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions