Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆంధ్రాలో వికసించనున్న పొత్తు !

Chandrababu, Pawan Meets Amit Shah| టీడీపీ ( Tdp ), జనసేన ( Janasena ) కూటమి లో బీజేపీ ( Bjp ) చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ), బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ( Jp Nadda ) లతో గురువారం రాత్రి భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ).

కూటమి లో బీజేపీ చేరడం ఖరారు అయినా, సీట్ల సర్దుబాటు పై ఈ నేతలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

పొత్తులో భాగంగా బీజేపీ కి 4 పార్లమెంట్ ( Parliament ), 6 అసెంబ్లీ ( Assembly ) స్థానాలను చంద్రబాబు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. రాజమండ్రి ( Rajahmundry ), అరకు ( Araku ), రాజంపేట ( Rajampeta ) మరియు తిరుపతి ( Tirupati ) పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయిస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లను గెలవాలనే లక్ష్యం తో తాము ముందుకు వెళ్తున్నట్లు, ఇందులో భాగంగా 6 నుండి 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాగా టీడీపీ, జనసేన లతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినా సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions