Wednesday 11th February 2026
12:07:03 PM
Home > తాజా > ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

tgsrtc green metro

TGSRTC Good News To IT Employees | ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఓ శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరింత రవాణా సౌకార్యార్థం ఆరు కొత్త గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

216W నెంబర్ బస్సు లింగంపల్లి- మెహాదీపట్నం రూట్లో నడవనుంది. వయా నల్లగండ్ల, విప్రో సర్కిల్, నానక్ రామ్ గూడా, కాజా గూడా, టోలిచౌకి, మెహిదీపట్నం రూట్ వరకు రాకపోకలు ఉంటాయి. 216G నెంబర్ బస్సు లింగంపల్లి-లక్ష్మీ జీఏఆర్.. వయా నల్లగండ్ల, క్యూ సిటీ, విప్రో సర్కిల్, లక్ష్మీ జీఏఆర్ రూట్లో నడుస్తాయి.

ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఎండీ సజ్జనార్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బస్సుల్లో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణం ఉంటుందని తెలిపారు.

You may also like
traffic challans
వాహనదారులకు అలర్ట్.. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్!
municipality
మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖలు.. ఎక్కడెక్కడంటే!
ts govt logo
వాహనదారులకు భారీ ఊరట.. ఆ పన్ను నుంచి మినహాయింపు?
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions