Saturday 7th June 2025
12:07:03 PM
Home > తాజా > ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

tgsrtc green metro

TGSRTC Good News To IT Employees | ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఓ శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరింత రవాణా సౌకార్యార్థం ఆరు కొత్త గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

216W నెంబర్ బస్సు లింగంపల్లి- మెహాదీపట్నం రూట్లో నడవనుంది. వయా నల్లగండ్ల, విప్రో సర్కిల్, నానక్ రామ్ గూడా, కాజా గూడా, టోలిచౌకి, మెహిదీపట్నం రూట్ వరకు రాకపోకలు ఉంటాయి. 216G నెంబర్ బస్సు లింగంపల్లి-లక్ష్మీ జీఏఆర్.. వయా నల్లగండ్ల, క్యూ సిటీ, విప్రో సర్కిల్, లక్ష్మీ జీఏఆర్ రూట్లో నడుస్తాయి.

ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఎండీ సజ్జనార్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బస్సుల్లో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణం ఉంటుందని తెలిపారు.

You may also like
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున-అమల.. కారణమేంటంటే!
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions