Wednesday 1st April 2026
12:07:03 PM
Home > తాజా > ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!

tgsrtc green metro

TGSRTC Good News To IT Employees | ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఓ శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరింత రవాణా సౌకార్యార్థం ఆరు కొత్త గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

216W నెంబర్ బస్సు లింగంపల్లి- మెహాదీపట్నం రూట్లో నడవనుంది. వయా నల్లగండ్ల, విప్రో సర్కిల్, నానక్ రామ్ గూడా, కాజా గూడా, టోలిచౌకి, మెహిదీపట్నం రూట్ వరకు రాకపోకలు ఉంటాయి. 216G నెంబర్ బస్సు లింగంపల్లి-లక్ష్మీ జీఏఆర్.. వయా నల్లగండ్ల, క్యూ సిటీ, విప్రో సర్కిల్, లక్ష్మీ జీఏఆర్ రూట్లో నడుస్తాయి.

ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఎండీ సజ్జనార్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బస్సుల్లో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణం ఉంటుందని తెలిపారు.

You may also like
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions