TGSRTC Good News To IT Employees | ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఓ శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరింత రవాణా సౌకార్యార్థం ఆరు కొత్త గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
216W నెంబర్ బస్సు లింగంపల్లి- మెహాదీపట్నం రూట్లో నడవనుంది. వయా నల్లగండ్ల, విప్రో సర్కిల్, నానక్ రామ్ గూడా, కాజా గూడా, టోలిచౌకి, మెహిదీపట్నం రూట్ వరకు రాకపోకలు ఉంటాయి. 216G నెంబర్ బస్సు లింగంపల్లి-లక్ష్మీ జీఏఆర్.. వయా నల్లగండ్ల, క్యూ సిటీ, విప్రో సర్కిల్, లక్ష్మీ జీఏఆర్ రూట్లో నడుస్తాయి.
ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఎండీ సజ్జనార్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బస్సుల్లో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణం ఉంటుందని తెలిపారు.