Friday 22nd August 2025
12:07:03 PM
Home > తాజా > జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

TGSPDCL FIELD WORKERS

TGSPDCL Field Workers | తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జాతీయ రహదారులపై కూడా వరద రావడంతో రెండు రాష్ట్రాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రధాన పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వరద బాధితులకు వీలైనంత వరకు త్వరితగతిన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా TGSPDCL తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జోరు వర్షంలోనూ ఇద్దరు కార్మికులు స్తంభాలు ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్న వీడియోను TGSPDCL షేర్ చేసింది.

క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మా ఫీల్డ్ వర్కర్ల అంకితభావానికి వందనం అంటూ సంస్థ పోస్ట్ చేసింది. వర్షంలో మీ నిబద్ధతకు హాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసింది.   

You may also like
hydraa saves rs 400 crores value government property
రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
online games
ఆన్ లైన్ మనీ గేమ్స్ ఇక నేరమే.. ఉల్లంఘిస్తే భారీగా శిక్షలు!
aishwarya rai
సోషల్ మీడియాపై ఐశ్వర్యారాయ్ సంచలన వ్యాఖ్యలు!  
justice sudershan reddy
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions