Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బాబు గారు..గ్లోబల్ సమ్మిట్ కు రండి’

‘బాబు గారు..గ్లోబల్ సమ్మిట్ కు రండి’

Telangana invites CM Chandrababu to Global Summit | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ జరగనున్న విషయం తెల్సిందే. ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో రాజకీయ, సినీ, పారిశ్రామిక మరియు క్రీడా ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతుంది.

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి మంత్రి కోమటిరెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందజేశారు. దావోస్ నమూనాలో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రపంచ, జాతీయ పరిశ్రమల నేతలు, నిపుణులు పాల్గొననున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తుందని చంద్రబాబుకు కోమటిరెడ్డి వివరించారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions