Maharashtra Train Accident | మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించినట్లు వదంతులు వచ్చాయి.
దింతో ప్రయాణికులు చైన్ లాగి పక్కనే ఉన్న పట్టాలపైకి దిగారు. పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ ప్రయాణికులపై నుండి దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఎనమిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా మంటలు వ్యాపిస్తున్నట్లు వదంతులు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.