Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పిచ్చి రాతలు రాస్తే కఠిన చర్యలు.. నాగబాబు వార్నింగ్!

పిచ్చి రాతలు రాస్తే కఠిన చర్యలు.. నాగబాబు వార్నింగ్!

naga babu

Nagababu Warning | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమిపై నిరాధార, కల్పిత రాతలు రాస్తే ఊరుకునేది లేదని జనసేన (Janasena) నేత నాగబాబు (Naga Babu) హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసిపి పూర్తిగా చావలేదనీ, ఇంకా బతికే ఉందన్నారు. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలే ఇవనీ, వాటినెవ్వరు పట్టించుకోవద్దని నాగబాబు పిలుపునిచ్చారు.

కూటమికి‌ సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని తెలిపారు. పిచ్చి ప్రయత్నాలని ఎవరు రాసినా, స్ప్రెడ్ చేసిన ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు నాగబాబు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions