Friday 27th June 2025
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి!

కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి!

Chiranjeevi

Chiranjeevi Visits KCR | హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానన్నారు.

సినిమాలు ఎలా ఆడుతున్నాయి.. ఇండస్ట్రీ ఎలా ఉందని కేసీఆర్ ఈ సమయంలో కూడా అడగటం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలిపారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌ను పరామర్శించారు.  

You may also like
‘కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జూరాల ప్రాజెక్టు డేంజర్ లో’
యాంటీ డ్రగ్ డే..కార్యక్రమంలో సీఎం, రాంచరణ్, దేవరకొండ
సీఎం రేవంత్ కు యూకే మాజీ ప్రధాని లేఖ
modi
‘ఎమర్జెన్సీ’కి 50 ఏళ్లు.. నాటి అనుభవాలతో పుస్తకం: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions