Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > ప్రజా దర్బార్ కు విశేష స్పందన.. ఎన్ని వినతులు వచ్చాయంటే!

ప్రజా దర్బార్ కు విశేష స్పందన.. ఎన్ని వినతులు వచ్చాయంటే!

CM Revanth In Prajadarbar

Praja Darbar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీన ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్’ లో ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది.

ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి.

అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్ లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

తాజాగా సోమవారం నిర్వహించిన ‘ప్రజా వాణి’ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికారవర్గాలు వెల్లడించాయి.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions