Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

Viral News | వరద నీటిలో బైక్ మీద వెళ్తున్న ఓ జంటపై కొందరు ఆకతాయి యువకులు రెచ్చిపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాజధాని లక్నో ( Lucknow ) లో చోటుచేసుకుంది.

లక్నో లోని తాజ్ హోటల్ వంతెన కింద భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు చేరుకుంది. అయితే ఈ వరద నీటిలోకి కొందరు పోకిరీలు చేరి వాహనదారులు ఇబ్బందులకు గురి చేసారు.

బైక్ ( Bike ) పై వస్తున్న ఓ జంటపై బురద నీటిని చల్లుతూ, వెనకాల కూర్చున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దింతో సదరు జంట వరద నీటిలో పడిపోయింది. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టి, బాధితులను అక్కడి నుండి పంపించారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ ( Viral ) గా మారింది. జంటపై వరద నీరు చల్లుతూ వికృతానందం పొందిన పోకిరీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు పోకిరీలపై కేసును నమోదు చేసి, వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions